Monday, April 29, 2024

బాసర అమ్మవారిని దర్శించుకున్న కెటిఆర్ కుమారుడు

- Advertisement -
- Advertisement -

బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని బుధవారం సిఎం కెసిఆర్ మనువడు, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామరావు కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా నాయకులు, ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బాసర మండల బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

గోదావరి వంతెన నుంచి ఆలయం వరకు ద్విచక్ర వాహనంపై ర్యాలీ నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ పండితులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనను శాలువాతో సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మహాంకాళి ఆలయం వద్ద కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News