Saturday, May 4, 2024

నాకు వరమిచ్చారు: సిఎం రేవంత్‌కు కుమారీ ఆంటీ ధన్యవాదాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పాత స్థలంలోనే ఫుడ్ బిజినెస్ చేసుకొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వడంపై కుమారీ ఆంటీ స్పందించారు. తనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరం ఇచ్చారన్నారు. తాను తిరిగి అదే స్థలంలో ఫుడ్ బిజినెస్ చేసుకొనేందుకు అవకాశం కల్పించిన సిఎం రేవంత్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు తాను బతికున్నంత కాలం రేవంత్ రెడ్డిని గుర్తు పెట్టుకుంటానని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి రుణం ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. తన స్టాల్ వద్దకు సిఎం వస్తే ఆయనకు ఇష్టమైన ఫుడ్ చేసి పెడతానని కుమారీ ఆంటీ చెప్పారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందనే కారణంగా కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ ను హైద్రాబాద్ పోలీసులు క్లోజ్ చేయించారు. ఆమె ఫుడ్ వ్యాన్‌ను కూడ పోలీసులు సీజ్ చేశారు.

ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఈ క్రమంలో బుధవారం సిఎం రేవంత్ స్పందించారు. పాత స్థలంలోనే కుమారీ ఆంటీ తన ఫుడ్ బిజినెస్ ను కొనసాగించేందుకు అనుమతిని ఇచ్చారు. కుమారీ ఆంటీపై నమోదైన కేసు విషయంలో పున:పరిశీలించాలని కూడా పోలీసులను సీఎం ఆదేశించారు.

సిఎం ఆదేశాలను గౌరవించాలని స్ట్రీట్ సైడ్ వ్యాపారాలు చేసుకొనే వారికి కుమారీ ఆంటీ సూచించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాతో లాభం ఉంది.. నష్టం కూడా ఉందన్నారు. తన ఫుడ్ బిజినెస్ పెరగడానికి మీడియా కారణమని ఆమె గుర్తు చేశారు. తన ఫుడ్ బిజినెస్ సెంటర్ వద్ద ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకుంటానని కుమారీ ఆంటీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News