Saturday, April 27, 2024

పెండింగ్ చలాన్లపై రాయితీ గడువు మరోసారి పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాహనాల పెండింగ్ చలాన్ల రాయితీ గడువును మరోసారి తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది.ఈ మేరకు బుధవారం నాడు రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 వ తేదీ వరకు పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఇప్పటికే ఒక్కసారి గడువును పొడిగించింది.ఇవాళ్టితో గడువు ముగియనుంది. దీంతో గడువును ఫిబ్రవరి 15వ తేదీ వరకు పెంచింది సర్కార్. 2023 డిసెంబర్ 26వ తేదీన పెండింగ్ చలాన్లపై రాయితీని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.

2024 జనవరి 10వ తేదీన గడువును ఇచ్చింది. అయితే ఈ నెల 10వ తేదీన తొలిసారి గడువును పెంచింది. ఇవాళ్టి వరకు గడువును పొడిగించింది. అయితే ఇవాళ గడువును మరోసారి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ద్విచక్రవాహనాలు, మూడు చక్రాల వాహనాలపై 80 శాతం, కార్లపై 50 శాతం, హెవీ వెహికిల్స్ పై 60 శాతం రాయితీ ప్రకటించింది. 2022లో పెండింగ్ చలాన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.300 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 10వ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News