Wednesday, May 1, 2024

జోగులాంబ అమ్మ వారికి వస్త్రాలను సమర్పించిన కర్నూలు జిల్లా కలెక్టర్

- Advertisement -
- Advertisement -

Kurnool Collector give Saree to Jogulamba

 

మన తెలంగాణ అలంపూర్: దసరా శరన్నవరాత్రుల ను పురస్కరించుకొని ఎపి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆలయాల విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం ముఖ్య నిర్వహణాధికారి వీరేశం శాలువా కప్పి జిల్లా కలెక్టర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో లో ఆలయ చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్, ధర్మకర్త మండలి సభ్యులు వెంకటరమణ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News