Tuesday, April 30, 2024

దీప్‌సిద్దూ ఆచూకీ చెబితే లక్ష రూపాయల రివార్డు….

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై కిసాన్ జెండా ఎగరేయడానికి పురిగొల్పడంతో పాటు ఢిల్లీ అల్లర్లకు కారణమైన నిందితుడు దీప్‌సిద్దూ అచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని పోలీసులు తెలిపారు. సిద్ధూతో పాటు మరో ముగ్గురి గురించి సమాచారం ఇస్తే యాబై వేల రివార్డు ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. గత రెండు నెలల నుంచి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున రైతు సంఘాలు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రకోటపై సిక్కుల జెండా ఎగరేసే విధంగా సిద్దూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News