Saturday, May 4, 2024

యోగా టీచర్ ని చంపి…. బాత్రూమ్ లో పూడ్చి పెట్టి… లాయర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Murder

 

చెన్నై: యోగా టీచర్‌ ని చంపిన అనంతరం లాయర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం మదురై ప్రాంతం తిరుమంగళం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మదురైలో హరిక్రిష్ణన్ అనే లాయర్ తన పదేళ్ల కూతురుతో కలిసి జీవిస్తున్నాడు. తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్రదేవీ అనే యోగా టీచర్ అదృశ్యం కావడంతో ఆమె తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మదురై ఎస్‌పికి సిఎంఒ ఆఫీస్ నుంచి ఈ కేసును త్వరగా విచారణ జరపాలని కోరడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. యోగా టీచర్-లాయర్ మధ్య సంభాషణలు బయటపడడంతో విచారణ వేగవంతం చేశారు. విచారణ జరుపుతుండగా హరికృష్ణన్ అనే లాయర్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్రాదేవిని చంపిన అనంతరం తన బాత్రూమ్‌లో గుంత తీసి మృతదేహాన్ని పూడ్చాడు. విచారణలో బయటపడుతుందనే అనుమానంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News