Monday, April 29, 2024

హత్య… రెజ్లర్ సుశీల్ కుమార్ పరార్

- Advertisement -
- Advertisement -

Wrestler sushil kumar escape in Murder case

ఢిల్లీ: 24 ఏళ్ల రెజ్లర్ హత్య కేసులో ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ పరారీలో ఉండడంతో పోలీసులు అతడి హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోడల్ టౌన్‌లోని ఛత్రపాల్ స్టేడియం సమీపంలో ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఇంట్లో సాగర్, అతడి స్నేహితులు ఉంటున్నారు. వారు ఖాళీ చేయాలని సుశీల్ పలుమార్లు కోరాడు. ఇదే విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు సాగర్ కుమార్ దుర్మరణం చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిలో ఒక్కడు సునీల్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఓ వాహనంలో బుల్లెట్లు లోడ్ చేసిన గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యలో రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందని తెలియడంతో అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గురిక్బాల్ సింగ్ సిద్దూ తెలిపారు. దర్యాప్తులో భాగంగా సుశీల్ కుమార్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News