Sunday, April 28, 2024

భర్త వివాహేతర సంబంధం…. భార్య ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

women committed suicide in Secunderabad

చెన్నై: భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని తంజావూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంవత్సరం క్రితం రంగరాజు(30)కు భువనేశ్వరి(25) అనే యువతితో పెళ్లి జరిగింది. దంపతులు తిరుకాట్టుపల్లిలో నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరేసుకొని భువనేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె మృతి పట్ల అనుమానం ఉందని ఆమె తండ్రి కల్యాణ సుందరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివాహం జరిగినప్పటి నుంచి అల్లుడు రంగరాజ్, అతడి తల్లిదండ్రులు సుమతి, కలియమూర్తి వరకట్నం కోసం తన కూతురిని వేధింపులకు గురి చేశాడని పేర్కొన్నారు. అల్లుడికి వేరొక యువతితో వివాహేతర సంబంధం ఉందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఎదుట భువనేశ్వరి బంధువులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. డిఎస్‌పి సబీవుల్లా, సిఐ శ్రీదేవి అక్కడికి చేరుకొని అతడిపై కేసు నమోదు చేశామని ధర్నా విరమించాలని కోరారు. రంగరాజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News