Wednesday, May 15, 2024

బంగ్లాదేశ్‌లో పెళ్లి బృందంపై పిడుగులు, 16మంది మృతి

- Advertisement -
- Advertisement -

Lightning strike on wedding party in Bangladesh

 

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఓ పెళ్లి విందు కోసం పడవలో వెళుతుండగా పిడుగులు పడటంతో 16మంది చనిపోయారు. పెళ్లి కుమారుడు కూడా ఈ ఘటనలో గాయపడ్డాడు. ఆ సమయంలో పెళ్లి కూతురు పడవలో లేదని అధికారులు తెలిపారు. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే పలుమార్లు పిడుగులు పడ్డాయని వారు తెలిపారు. బుధవారం చాపైనవాబ్‌గంజ్ జిల్లాలోని షిబగంజ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ప్రతియేటా వర్షాకాలంలో బంగ్లాదేశ్‌లో పిడుగులు పడి 200కుపైగా మృతి చెందుతున్నారని స్థానికులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News