- Advertisement -
ముంబయి: దగ్గినందుకు ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకిందని అనుమానించి స్థానికులు దాడి చేయడంతో సదరు వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన మహారాష్ట్ర థానే జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గణేష్ గుప్తా అనే వ్యక్తి నిత్యావసరాల సరుకుల కోసం బయటకు వెళ్లాడు. ఆయన వెళ్తున్న దారిలో పోలీసులు ఉండడంలో పక్క సందులో నుంచి వెళ్తుండగా ఒక్కసారిగా దగ్గాడు. గుప్తాను కరోనా రోగిగా అనుమానించి స్థానికులు అతడిని తీవ్రంగా కొట్టి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Local killed Cough person in Thane in Maharashtra
- Advertisement -