Saturday, April 27, 2024

ప్రేమ జంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కెపిహెచ్‌బి: ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సం ఘటన కెపిహెచ్‌బి హౌ సింగ్‌బోర్డు కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. కెపిహెచ్‌బి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం చెందిన శ్యాం (25), జ్యోతి (24) గత కొన్ని సంవత్సరాలుగా ప్రే మించుకుంటున్నారు. రెండేళ్ల క్రి తం తల్లిదండ్రులు కుదర్చిన వ్యక్తితో జ్యోతికి వివాహం జరిగింది. శ్యాం బెం గళూరులో పాస్టర్ శిక్షణ పొం దుతున్నాడు. గత మూడు రోజుల క్రితం జ్యోతి, శ్యాంలు నగరానికి వచ్చి కెపిహెచ్‌బి 7ఏడో పేజ్‌లోని శ్యాం స్నేహితుడు వంశీకృష్ణ ఉంటున్న గదిలో కలుసుకున్నారు.

ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కాని జ్యోతి విషం తాగి అక్కడికక్కడే మృతి చెందగా, శ్యాము అదే రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉ రేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణ గది నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వ చ్చిన స్థానికులు పోలీసులకు సమా చారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దే హాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కూకట్‌పల్ల్లి సిఐ కిషన్ కుమార్ తెలిపారు. గత మూడు రోజుల క్రితమే ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News