భువనేశ్వర్: ఎల్టీటీ ఎక్స్ప్రెస్ గురువారం తెల్లవారుజామున ఒడిశాలోని నిర్గుండి వద్ద పట్టాలు తప్పింది. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆరు బోగీలు పక్కకు ఒరిగాయి. దీంతో దాదాపు యాభై మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం కటక్లోని ఓ దవాఖానకు తరలించారు. గాయపడిన వారినిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందిని వైద్యులు వెల్లడించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పొగమంచు కారణంగానే ఈ ఘోరప్రమాదం జరిగినట్టు రైల్వే పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఈ రైలు ప్రమాదంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
LTT Express derailed near Nergundi railway station
- Advertisement -