Friday, April 26, 2024

మధిర మాజీ ఎంఎల్ఎ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Madhira Ex MLA Venkata Narsaiah Passed Away

ఖమ్మం: మధిర మాజీ ఎంఎల్ఎ కట్టా వెంకటనర్సయ్య కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. 2014లో సిపిఎం పార్టీ తరుపున ఎంఎల్ఎగా కట్టా వెంకటనర్సయ్య గెలుపొందారు. మధిర శాసనసభ స్థానం నుంచి రెండుసార్లు సిపిఎం ఎంఎల్ఎగా ఆయన పనిచేశారు. కట్టా వెంకటనర్సయ్య చనిపోయేంత వరకు పార్టీ సిద్ధాంతలకు కట్టుబడి పనిచేశారు.  ఆయన మృతి పట్ల పలువురు సిఎం కెసిఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పలువురు సిపిఎం నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. వెంకటనర్సయ్య కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

Madhira Ex MLA Venkata Narsaiah Passed Away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News