Wednesday, May 8, 2024

కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

భోపాల్: కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం శాట్నా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహిళా(30) కోట్ని రైల్వే స్టేషన్‌లో ఆమె వుంచెరా వెళ్లేందుకు టికెట్ తీసుకుంది. రైలులో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లో ఆమె వెళ్లింది. కమలేష్ కుశావా అనే వ్యక్తి కొట్ని రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కాడు. పకారియా రైల్వే స్టేషన్ దాటిన తరువాత సదరు మహిళతో కమలేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ కంపార్ట్‌మెంట్‌లో ఎవరు లేకపోవడంతో ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. రేవా రైల్వే స్టేషన్ వచ్చిన తరువాత ఆమె రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆమెను రైల్వే ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బండా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News