Wednesday, May 8, 2024

మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

Sanjeeb Benerjee
చెన్నై: న్యాయస్థానం, ఉద్యోగులు, తదితరులకు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన సందేశం ఇచ్చారు. ఈ న్యాయస్థానంలో భూస్వామ్య సంస్కృతిని ధ్వంసం చేయలేకపోయినందుకు తాను తీవ్రంగా విచారిస్తున్నానన్నారు. తనకు సంపూర్ణ సహకారం అందించిన హైకోర్టు ఉద్యోగులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ మేఘాలయ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తాను ఈ సుందరమైన, ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రం(తమిళనాడు)లో 11 నెలలపాటు పనిచేశానని, ఇక్కడి నుంచి చాలా మధుర జ్ఞాపకాలతో వెళుతున్నానని తెలిపారు.నవంబర్ 9న . జస్టిస్ సంజీబ్ బెనర్జీని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News