- Advertisement -
ముంబై: కోవిడ్-19 కొత్త వేరియంట్ పై మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మహారాష్ట్రకు వచ్చేవారిపై ఆంక్షలు విధించారు అధికారులు. రెండు కోవిడ్ డోసులు వేయించుకున్నవారికే మహారాష్ట్రలోకి ఎంట్రీఅని సర్కార్ స్పష్టం చేసింది. ఆర్టీపిసిఆర్ రిపోర్టుతోనే రావాలని నిబంధన పెట్టింది మహాప్రభుత్వం. సౌతాఫ్రికా నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ తప్పనిసరని తేల్చిచెప్పింది ప్రభుత్వం. రాష్ట్రంలోకి ప్రవేశించే దేశీయ ప్రయాణికులను గుర్తించి టీకాలు వేయాలని, 72 గంటల పాటు చెల్లుబాటు అయ్యే కోవిడ్-19 (ఆర్టీ-పీసీఆర్) పరీక్ష నివేదికను తీసుకెళ్లాలని పేర్కొంది. ముంబై పౌరులు ఫేస్ మాస్క్లు ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం, సామాజిక దూరాన్ని కొనసాగించాలని అధికారులు కోరారు.
- Advertisement -