- Advertisement -
నేషనల్ అవార్డుకు ఎంపికైన ఉమెన్ పిసిని పరిచయం చేసిన సిపి మహేష్ భగవత్
హైదరాబాద్: ఇటీవల నేషనల్ అవార్డుకు ఎంపికైన ఉమెన్ కానిస్టేబుల్ శివరాణిని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పరిచయం చేశారు. ఈ మేరకు బుధవారం హోంమంత్రిని కలిసిన సిపి మహేష్ భగవత్, మల్కాజ్గిరి డిసిపి రక్షిత మూర్తి సిసిటిఎన్ఎస్ డాటా ఎంట్రీ గురించి వివరించారు. ఎన్సిఆర్బి ఆన్లైన్ కాన్ఫరెన్స్ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించింది. దేశవ్యాప్తంగా డాటా ఎంట్రీని సమర్థవంతంగా ఎంట్రీ చేస్తున్న 34మందిని ఎంపిక చేయగా ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఉమెన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శివరాణి ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ముగ్గురు కానిస్టేబుళ్లు ఎంపికయ్యారు.
Mahesh Bhagwat meets Home Minister Mohammad Ali
- Advertisement -