Tuesday, May 14, 2024

సున్నితమైన అంశాన్ని వినోదాత్మకంగా చూపించాం

- Advertisement -
- Advertisement -

Malli modalaindi movie

 

‘మళ్ళీ రావా‘ వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో ఈడీ ఎంటర్‌టైన్‌మెట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించా రు. ఈ సినిమాను ‘జీ 5’ ఒటిటి తాజాగా విడుదల చేసిం ది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… విడాకుల తీసుకున్న జంట కథే అయినా వారి జీవితం ఎలా మళ్ళీ మొదలైంది అనేది ఈ సినిమాలో కొత్తగా చూపించాము. చాలా సున్నితమైన అంశాన్ని ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపించడం జరిగింది. రియలిస్టిక్‌గా వయస్సు రీత్యా కథలోని పాత్రకు సుమంత్ సరిపోతాడని ఆయనను తీసుకున్నాము. ఈ సినిమాను చూసినవారు బాగుందని ప్రశంసిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News