Saturday, April 27, 2024

బావిలో పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Man dead after fell into well

మన తెలంగాణ/కాటారం : ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలంలోని చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బొబ్బిలోనిపల్లి గ్రామానికి చెందిన జరుపుల సంపత్ ( 55) అనే వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. కాటారం మండలం గంగారం గ్రామంలో సంపత్ కూతురు అజ్మీరా రజిత ఇంట్లో ఈనెల ఓ శుభకార్యానికి హాజరైనట్లు తెలిపారు. కార్యం ముగించుకొని శనివారం ఇంటికి వెళ్ళే క్రమంలో ఉదయాన్నే బహిర్భూమికి వెళ్లగా చెట్ల పొదల్లో ఉన్న బావిని గ్రహించని సంపత్ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతినట్లు కూతురు రజిత తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహాదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News