Saturday, May 4, 2024

ద్విచక్ర వాహనం పై నుంచి పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

కోదాడ: ప్రమాదవశాత్తు ద్వికచక్ర వాహనం పై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన కూచిపూడి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం కూచిపూడి గ్రామానికి చెందిన మిర్యాల గోవిందస్వామి తన ద్విచక్ర వాహనం పై రోజు వారి విధుల నిమిత్తం మేళ్ల చెరువుకు వెళ్తున్న క్రమంలో తొగర్రాయి గ్రామ సబ్‌స్టేషన్ దగ్గర రహదారి పై కుక్క అడ్డుగా రావడంతో సడెన్ బ్రేక్ వేయడంతో క్రింద పడి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స నిమితం ఖమ్మం తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News