Wednesday, May 1, 2024

విద్యుదాఘాతంలో కార్మికుడి మృతి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కరెంట్ పోల్ ఎక్కిన కార్మికుడు విద్యుదాఘాతంలో మృతిచెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలాపురి కాలనీలో శనివారం చోటుచేసుకుంది. విద్యుత్ కార్మికుడు బాబు ఉదయం మరమ్మత్తు చేసేందుకు విద్యుత్ స్థంభాన్ని ఎక్కాడు. అదే సమయంలో విద్యుత్ ప్రసారం కావడంతో పోల్‌పైనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యుత్‌ను ఆపివేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News