Friday, April 26, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

Man Killed in Road Accident At Khammam

వేంసూరు: ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని శంభునిగూడెంలో మూలమలుపు వద్ద భైకు అదుపుతప్పి ఫెన్సింగ్‌పోల్‌కు ఢీకొన్న సంఘటనలో యువకుడు మృతి చెందాడు. మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. కృష్ణా జిల్లా ఏ కొండూరుకు చెందిన నరట్ల కిరణ్‌కుమార్‌రెడ్డి (25) అనే యువకునితోపాటు మరోకరు సత్తుపల్లికి పనిమీద వెళ్లి తిరుగు ప్రయాణంలో తన స్వగ్రామంకు వెళ్తుండగా శంభునిగూడెం వద్ద మూలమలుపుకు రాగానే గ్లామర్ బండి అదుపుతప్పి ఫెన్సింగ్ పోల్‌కు తగిలింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన కిరణ్‌కుమార్‌రెడ్డిని దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Man Killed in Road Accident At Khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News