వైన్ సిబ్బంది దాడిలో యువకుడి మృతి
ఉప్పల్ మహంకాళి వైన్స్ వద్ద ఘటన
హైదరాబాద్: ఆమ్లెట్ డబ్బుల కోసం జరిగిన గొడవలో ఏకంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన నగరంలోని ఉప్పల్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం లంగర్హౌస్కు చెందిన వికాస్ (35) ప్రైవేట్ ఉద్యోగి, తన స్నేహితుడు బబ్లూతో కలిసి మద్యం తాగేందుకు ఉప్పల్లోని మహంకాళి వైన్స్కు వెళ్లాడు. పర్మిట్ రూములో మద్యం తాగుతున్న సమయంలో ఆమ్లెట్ ఆర్డర్ చేశారు. దుకాణ నిర్వాహకుడు వికాస్ను డబ్బులు ఇవ్వాలని అడగటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన యజమాని, దుకాణ సిబ్బంది వికాస్, బబ్లూపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వికాస్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.