Tuesday, April 30, 2024

భూతగాదాలు-పాతకక్షల నేపథ్యం… లారీతో తొక్కించి…

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: భూతగాదాలతో పాటు పాత కక్షల నేపథ్యంలో వారించబోయిన యువకుడిని లారీతో వెంటాడి వెంటాడి ఢీకొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ గేటు శివారులో బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాలకిషన్ సింగ్, నిరంజన్‌సింగ్ మధ్య గత 20 ఏళ్ల నుంచి భూముల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. 2004వ సంవత్సరంలో జరిగిన గొడవల్లో నిరంజన్ సింగ్-రాజేష్ సింగ్ తల్లిదండ్రులు భారతీబాయి, బాలాజీ సింగ్‌లు హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బాలకిషన్ సింగ్‌తో తమకు ప్రాణాపాయం ఉందని స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిరంజన్ సింగ్-రాజేష్ సింగ్ ఫిర్యాదు చేశారు. ఇద్దరు అన్నదమ్ములు తన స్నేహితులు, అనుచరులతో కలిసి రెండు కార్లలో మేడిగడ్డకు చేరుకొని వ్యవసాయ క్షేత్రంలో కూలీలతో వరి కోత పనులు చేయిస్తున్నారు. బాలకిషన్ సింగ్ మరో ఐదుగురుతో కలిసి లారీలో అక్కడికి చేరుకొని రెండు కార్లను ఢీకొట్టాడు. రాజేష్ సింగ్ స్నేహితుడు ఏకుల సందీప్‌ను(26) వారిని అడ్డుకోబోయాడు. నిందితులు లారీ అతడి పైనుంచి పోనిచ్చారు. సందీప్ తప్పించుకొని రోడ్డుపై పరుగులు తీశాడు. లారీతో వెంటాడి అతడి పైనుంచి పోనిచ్చారు. ఛాతీభాగం బాగా ఒత్తిడికి గురికావడంతో అతడు స్పృహ కోల్పోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించి వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని వెల్లడించారు. పారిపోతున్న నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించామని సిఐ ఉపేందర్, ఎస్ఐ ధర్మేశ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News