Saturday, May 4, 2024

ప్రాణాలు తీసిన వాట్సాప్ స్టేటస్

- Advertisement -
- Advertisement -

Man murder with Whatsapp special status

అమరావతి: ఇంటర్ విద్యార్థి తన స్నేహితుడు ప్రేమించే ఫోటోను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోవడమే కాకుండా ఐ లవ్ యు పెట్టడంతో మరుసటి రోజే అతడు శవంగా మారిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన సాయి అనే యువకుడు విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉండవల్లి సెంటర్‌లో ఐటిఐ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఐటిఐ విద్యార్థి తన ఇంటి పక్కన ఉన్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయి ఫోటోను తన స్టేటస్‌లో పెట్టడంతో పాటు ఐ లవ్ యు అని రాశాడు. ఐటిఐ విద్యార్థికి వాట్సాప్ స్ట్టేటష్‌లో ఆ విషయం కండపడింది. ఉండవలి సెంటర్‌కు సాయికి ఐటిఐ విద్యార్థి కబురు పంపాడు. అక్కడికి వచ్చిన తరువాత మరో ముగ్గురుతో కలిసి సాయిపై దాడి చేశారు. అప్పటి నుంచి సాయి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సాయిపై దాడి చేసిన యువకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తుండగా మరో వైపు సాయి మృతదేహం కాలువలో బయటపడింది. తన కుమారుడిని చంపి కాలువలో పడేశారని సాయి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News