బెంగళూరు: ఓ యువకుడు చనిపోయే ముందు చివరి నిమిషంలో ఎలా ఉంటుందో అని …. పురుగుల మంది తాగి… టిక్ టాక్ చేసి యువకుడు మృతి చెందిన సంఘటన కర్నాటకలోని తుమకూరు జిల్లా కోరాటగేర్ తాలూకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గౌరాగ్నహళ్లి గ్రామానికి చెందిన ధనంజయ్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఆటో నడవకపోవడంతో ఇంటి దగ్గరనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు టిక్టాక్ వీడియోలు చేస్తుండేవాడు. టిక్టాక్లో ఆయనకు 431 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మరణించే చివరి క్షణంలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునేవాడు. పురుగుల మందు డబ్బా తీసుకొని బైక్పై పొలం దగ్గరుకు వెళ్లాడు. అనంతరం పురుగుల మందు తాగి 15 సెకన్ల టిక్టాక్ వీడియోను తీశాడు. స్నేహితులకు ఈ విషయం తెలియడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. దీంతో అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
చనిపోయే ముందు చివర క్షణం ఎలా ఉంటుందోనని టిక్టాక్ వీడియో
- Advertisement -
- Advertisement -
- Advertisement -