Sunday, May 5, 2024

కరోనా వచ్చిందని గొంతు కోసుకున్నాడు…

- Advertisement -
- Advertisement -

man suicide attempt in krishna district due to corona

కంచికచర్ల : కరోనా వైరస్ సోకిందనే మనస్థాపంతో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల రంగానగర్ లో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు కంచికచర్ల జిల్లా పరిషత్ స్యూల్ లో గుమస్తాగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. స్థానికంగా ఉండే జోన్నలగడ్డ నారాయణ కరోనా టెస్టులు చేయించుకున్నాడు. అందులో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మనస్తాపం చెందాడు. గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆయనను గమనించిన కుటుంబసభ్యలు చికిత్స నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News