Saturday, May 4, 2024

మంచిర్యాలలో దారుణం

- Advertisement -
- Advertisement -

కోటపల్లి : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం షెట్ పల్లిలో శుక్రవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. ఒక వ్యక్తి తన పొలంలోకి ఎడ్లు వెల్లాయని దళితుడిని బర్రె మట్టుకు కట్టేశాడు. పశువులను కట్టేసే మట్టు(పాతిగుంజ)కు తాళ్లతో కట్టేసి బండబూతులు తిట్టాడు. ఆ వ్యక్తిని రామిరెడ్డిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఇంటి ముందు కట్టేసిన వ్యక్తిని విడిపించారు. అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News