రాంచీ: మావోయిస్టు ఏరియా కమాండర్ హతమైన సంఘటన జార్ఖండ్ రాష్ట్రం రాంచీ జిల్లాలోని లోధ్మాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లోధ్మాల్ మావోలు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఛేట్ గ్రామ శివారులో భద్రతా బలగాలు అలజడి విన్న మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏరియా కమాండర్ పునరై ఒరాన్ హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి కొందరు మావోలు తప్పించుకున్నారని ఎస్ఎస్పి సురేందర్ ఝా తెలిపాడు. పునరై ఒరన్ తలపై రెండు లక్షల రూపాయల రివార్డు ఉంది. రాంచీ జిల్లాలో అతడిపై 14 కేసులు ఉన్నాయి. వారం రోజుల క్రితం ఖుంటీ ఎన్కౌంటర్లో పిఎల్ఎప్ఐ లీడర్ జైడెన్ గుడియా హతమైన విషయం తెలిసిందే. అగ్రనేతలు కోల్పోవడంతో పిఎల్ఎఫ్ఐ సంస్థ నిర్వీర్యం మవుతోంది.
మావోయిస్టు ఏరియా కమాండర్ హతం
- Advertisement -
- Advertisement -
- Advertisement -