Friday, April 26, 2024

మారుతీరావు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మిర్యాలగూడః రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మారుతీరావు ఆత్మహత్య ఉదంతంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మారుతీరావు ఆత్మహత్యకు సంబంధించి ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక తాజాగా బహిర్గతమైంది. ఆ నివేదికను పోలీసు అధికారులకు అందింది. ఈ నివేదికలో మారుతీరావు శరీరంపై ఎలాంటి గాయాలనూ వైద్యులు గుర్తించలేదని తెలుస్తోంది. అయితే బ్రెయిన్ డెడ్ కారణంగానే ఆయన మరణించారని పేర్కొన్నారు. మారుతీరావు తిన్న గారెల్లో విషం కలిపినందువల్లే శరీరం రంగు మారిందని డాక్టర్లు రిపోర్ట్‌లో రాశారు. విషం తీసుకున్న తర్వాత ఆయన శరీరంలో రక్తప్రసారానికి అవాంతరాలేర్పడ్డాయని, ఫలితంగా రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే ప్రాణాలు పోయి ఉంటాయని తమ పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. హైదరబాద్‌లోని ఓ వైశ్యభవన్‌లో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న మారుతిరావు మృతదేహానికి హైదరాబాద్‌లోనే పోస్టుమార్టం జరిగింది.

Maruti Rao last rites completed in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News