Saturday, May 4, 2024

యాక్షన్ థ్రిల్లర్ షురూ

- Advertisement -
- Advertisement -

Mass maharaj act in Khiladi movie

మాస్ మహారాజా రవితేజ ‘ఖిలాడి’ మూవీ సెట్స్‌పై ఉండగానే ఇటీవల మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. రవితేజ నటిస్తున్న ఈ 68వ చిత్రంతో శరత్ మండవ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను గురువారం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో రవితేజ, ఇతర ప్రధాన తారాగణమంతా పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఇందులో రవితేజ ఓ కుర్చీపై కూర్చోని ఉండగా.. ఎదురుగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అనే బోర్డు కనిపిస్తుంది. అలానే ఓ ప్రభుత్వ అధికారి ప్రమాణ స్వీకారం చేసిన ఒక పాత లెటర్ ను కూడా ఈ పోస్టర్‌లో చూపించారు. ఇక రవితేజ ముందున్న ందున్న టైప్‌రైటర్, – ఫైల్స్ మొదలైనవాటిని గమనించవచ్చు. ఇదంతా చూస్తుంటే ఈ చిత్రంలో ఈ స్టార్ హీరో ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నాడని అర్థమవుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన కథతో ఈ స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవితేజ ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త పాత్రను పోషిస్తున్నారు.

ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. నాజర్, – నరేష్, – పవిత్ర లోకేష్, – రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News