Monday, April 29, 2024

పాత్రల్లో ఒదిగిపోయారు

- Advertisement -
- Advertisement -

ఎల్.విజయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. ఈ చిత్రానికి విష్ణు ఇందూరి, – శైలేష్ ఆర్.సింగ్ నిర్మాతలు. ఐరన్ లేడీగా పిలువబడే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ‘తలైవి’ కొత్త ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో అమ్మ జయలలితగా కంగన.. ఎంజీఆర్‌గా అరవింద స్వామి అచ్చు గుద్దినట్టు సరిపోయారు. వీరిద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి కనిపించారు. ఇక తమిళం,- తెలుగు-, హిందీ భాషల్లో ఈ చిత్రం అత్యంత భారీగా రిలీజ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News