Friday, April 26, 2024

హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్ కేంద్రం

- Advertisement -
- Advertisement -

Med Tranic established in Hyderabad

అమెరికా బయట రెండో కార్యస్థానం ఇక్కడే
లైఫ్ సైన్సెస్ రాజధానిగా భాగ్యనగర స్థానం మరింత పదిలం
కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: మెడ్‌ట్రానిక్ అమెరికా తర్వాత రెండవ కేం ద్రాన్ని హైద్రాబాద్‌లో ఏర్పాటు చేయడం సం తోషంగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. అమెరికా వెలుపల హైదరాబాద్‌లో అతిపెద్ద కార్యాలయాలను ప్రా రంభించిన జాబితాలో మెడ్‌ట్రానిక్స్ చేరిందని వ్యాఖ్యానించారు. గూగుల్, అమెజాన్, ఫేస్‌బు క్, ఆపిల్ వంటి అగ్ర సంస్థలు ఇప్పటికే హైద్రాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తె లిపారు. నానక్‌రామ్‌గూడా బిఎస్‌ఆర్ టెక్ పా ర్క్‌లో మెడ్‌ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను బుధవారం మంత్రి కెటిఆర్ ప్రా రంభించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శా ఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరు లు పాల్గొనగా, అమెరికా కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్ మాన్ వర్చువల్ విధానంలో పా ల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మా ట్లాడుతూ, 11 నెలల్లో ఈ కేంద్రం పూర్తి చేయ టం హర్షణీయమని అన్నారు. లైఫ్ సైన్స్ కాపిటల్‌గా హైదరాబాద్ స్థానం ఇంకా బలపడుతోందని పేర్కొన్నారు. ఈ కేంద్రంలో ఎక్కువ వి లువ ఉన్న డిసైన్ అండ్ డెవలప్‌మెంట్ పరికరా ల తయారీ వల్ల ఆ రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రభుత్వ చర్యల వల్ల హైదరాబా ద్ మెడికల్ టెక్నాలజీ హబ్‌గా మారుతోందని అన్నారు. మెడికల్ పరికరాలు తయారు చెసే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఈ సందర్బంగా మంత్రి కేంద్రాన్ని కోరారు.2030 వరకు హైదరాబాద్ లైఫ్ సైన్స్ మార్కెట్ విలువ 100 బిలియన్‌లకు చేరేందుకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ మెడ్ టెక్ ప్లాన్‌కు ఈ మెడ్‌ట్రానిక్స్ కేంద్రం ఊపయోగపడుతుందని చెప్పారు. మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రం ఏర్పాటుతో హెల్త్‌కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
రూ.1,200 కోట్లతో మెడ్‌ట్రానిక్ కేంద్రం ఏర్పాటు
అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్‌ట్రానిక్ రూ.1,200 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రపంచస్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్, ఆవిష్కరణలు చేయనుంది. దీనిద్వారా హెల్త్‌కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్‌ట్రానిక్ పనిచేస్తున్నది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తున్నది. నగరంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం ద్వారా ప్రారంభంలో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విడతల వారీగా మరో నాలుగు వేల మందికి ఉపాధి కల్పించనుంది. మెడ్‌ట్రానిక్ సంస్థ అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే తన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News