Friday, April 26, 2024

మాజీ మంత్రి నాయినిని పరామర్శించిన మంత్రి ఈటల

- Advertisement -
- Advertisement -

Minister Etela who consulted former Minister Naini Narasimhareddy

 

మన తెలంగాణ/హైదరాబాద్ : తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రి ఈటల నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. నాయిని ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో చర్చించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈసందర్బంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నాయిని నర్సింహ్మారెడ్డికి అత్యవసర వైద్యం అందిస్తున్నారని, వైద్యులు చేసే కృషితో ఆయన త్వరగా కోలుకోవాలన్నారు. అంతకు ముందు నాయిని కుటుంబ సభ్యులతో మంత్రి ఈటల మాట్లాడి ధైర్యం చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News