Wednesday, May 1, 2024

రాబోయే వందేళ్ల భావితరానికి సరిపడే ప్రగతితో మానేరు రివర్ ఫ్రంట్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: యావత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేలా అత్యాధునిక హంగులతో భావితరానికి వందేళ్లు సరిపడేలా మానేరు రివర్ ఫ్రంట్ నిలువనుందని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
గురువారం మానకొండుర్ శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, నగర మేయర్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి వంతెనపై 6.5 కోట్లతో ఏర్పాటు చేయనున్న డైనమిక్ లైటింగ్ సిస్టం పనులను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… రాబోయే వందేళ్ల భావితరానికి సరిపడే అభివృద్ధితో నిర్మిస్తున్న కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులతో కరీంనగర్ జిల్లా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించనుందని పేర్కొన్నారు.

మానేరు వంతేన నిర్మాణ పనులు ఒకవైపు పూర్తిచేసుకోవడం జరిగిందని మరోవైపు కూడా త్వరలోనే పూర్తిచేసుకొని రోడ్డుపనులు ప్రారంభం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. మానేరు వంతెనను మరింత అందంగా తీర్చిదిద్దే క్రమంలో వంతెనపై 6.5 కోట్లతో డైనమిక్ లైటింగ్ సిస్టం పనులను ప్రారంభించుకోవడం జరుగుతుందని, వీటితో పాటుగా అల్గునూర్ బ్రిడ్జి పై నిలబడి చూసిన స్పష్టంగా కనిపించేలా జర్మన్ టెక్నాలజీతో 45వేల పిక్సల్ గల 10×30 సైజులో 65 కనిపించేలా మానేరు వంతెనకు ఇరువైపుల రెండుచోప్పున 4 టివీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా అడ్వర్టైజ్ మెంట్ మొదలగు చిత్రాలను ప్రదర్శించడం జరుగుతుందని వెల్లడించారు. ఇప్పటికే పలు పారిశ్రామిక రంగాల దృష్టిని సైతం ఆకర్షించడంతో హోటల్ మొదలగు వాటి ఏర్పాటు పలువురు ముందుకువస్తున్నారని తెలిపారు.

వీటి పనులపూర్తిని బట్టి జూన్ 2 న గాని లేదా ఆగష్టు 15 న ప్రారంభించు కోవడానికి ప్రణాళికలను సిద్దం చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. మానేరు వంతెన ఒకవైపు ఇప్పటికే పూర్తిఅయిందని, మరో వైపు కూడా పూర్తిచేసుకొని వాహనాల రాకపోకలను ఉగాది నుండి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఇదివరకే అనుకున్నట్లుగా అప్పర్ , లోయర్ ప్రామినెడ్ పనులను కూడా పూర్తిచేసుకొని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఫౌంటెన్ ను పనులను 60 కోట్లు మంజూరై టెండర్లు పూర్తయినవని 3,4 రోజులలో పనులు ప్రారంభించుకోవడం జరుగుతుందని ఈ వాటర్ ఫౌంటెన్ లు యావత్ ప్రపంచంలోనే మూడు దేశాలలో మాత్రమే ఉన్నాయని, చైనా , సౌత్ కొరియా లొని సియోల్ తరువాత మన కరీంనగర్ లోనే ఈ వాటర్ ఫౌంటెన్ ఉండనుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్, మేయర్ వై. సునీల్ రావు, డిప్యూటి మెయర్ చల్లస్వరూపరాణి, కరీంనగర్, జిందా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్,ఆర్డిఓ ఆనంద్ కుమార్, కొత్తపెల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఆర్అండ్ బి ఈ ఈ సాంబశివరావు, డిఈ రవీందర్, ఎఈ రాజా శేఖర్, అశోక్, కాంట్రాక్టర్ కమాలుద్దీన్ ఇతర అధికారులు,కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News