Friday, April 26, 2024

స్మార్ట్ సిటీ పనులను పర్యవేక్షించిన మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : కరీంనగర్ లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను గడువులోగా పూర్తి చేయాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేడు సోమవారం స్మార్ట్ సిటీ ఫేజ్ 2 పనులలో భాగంగా ఓల్డ్ పవర్ హౌజ్, నుండి నాకా చౌరస్తా వరకు నిర్మితమవుతున్న పనులను బొమ్మకల్ చౌరస్తా లో మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. పనుల పురోగతిని కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరుపట్ల మంత్రి గంగుల సంతృప్తి వ్యక్తం చేశారు..

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. పనులన్నీ గడువు లోగా పూర్తి చేయాలనీ అన్నారు. మంగళి వాడ చౌరస్తా నుండి వరాహ స్వామి టెంపుల్, నిత్యం రద్దిగా ఉండే టవర్ సర్కిల్ ప్రాంతం, రాజు టీ స్టాల్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ నాంపల్లి శ్రీనివాస్ సుడా డైరెక్టర్ నేతి రవి వర్మ, ఆంజనేయులు స్మార్ట్ సిటీఇంజనీర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News