Saturday, May 4, 2024

సిద్దిపేట లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట లో అంతర్జాతీయ యోగా దినోత్సవం లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యోగ ను మన జీవనవిధానం గా మార్చుకోవాలని, యోగ తో అన్ని రకాల వ్యాధుల కు చెక్ పెట్టవచ్చన్నారు. ఈ మధ్య కాలంలో బీపీ షుగర్ లాంటి వ్యాధుల పెరుగుతున్నాయి. ఆరోగ్యం కాపాడుకోవాలని, ఖర్చు లేని పని యోగ సాధన చేయడమన్నారు. అందరము ఎంతో బిజీగా ఉన్నామని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలకు యోగ ఆసనాలు ప్రాణాయామం నేర్పిస్తున్నాము. మెడికల్ కాలేజీలో యోగాను ఒక బాగంగా చేశామని, పిల్లలకు యోగ కాన్సంట్రేషన్ పెంచుతుందని,మన యోగ ప్రపంచ దేశాల లో చేస్తున్నారన్నారు.

ప్రపంచం యోగ సాధన ద్వారా ఆరోగ్యాన్ని పొందింది.ఆరోగ్య తెలంగాణ అంటే గొప్ప వైద్య సేవలు అందించడం కాదు..రోగం రాకుండా కాపాడుకోవడమన్నారు. 7.4 గ్రీన్ కవర్ తో దేశంలో మొదటి స్థానంలో ఉంది. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం కాలుష్యాన్ని తగ్గించడానికి అన్ని స్థాయిలలో అమలుచేస్తున్నరు. క్యాన్సర్ పేషంట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ వారు ఆ వ్యధిని అధిగమిస్తున్నారని ఆయన అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము అనే సామెత ఊరికే రాలేదని, ఆరోగ్యం కాపాడుకోవాలి లేక పోతే బీపీ, సుగర్ లాంటి వ్యాధులు మనిషిని క్రమంగా పాడు చేస్తుందన్నారు. ప్రతీ మనిషి ఇంకో పది మంది కి యోగ చేపించాలి. సిద్దిపేట అనేక రంగాలలో అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంది ఆరోగ్యం లో కూడా మనం ముందుండలి.ప్రతీ లీడర్ తమ తమ గల్లీలో యోగ చెపించాలని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News