Saturday, April 27, 2024

కైట్ ఫెస్టివల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్:  అంతర్జాతీయ వేడుకలకు నగరం ముస్తాబవుతోంది. జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రైండ్స్‌లో అంతర్జాతీయ కైట్,స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లుచేస్తోంది. ఈ సందర్భంగా బేగంపేట హరిత ప్లాజాలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అంతర్జాతీయ కైట్ ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబించే విధంగా ఫెస్టివల్‌ను నిర్వహిస్తామన్నారు. మూడు రోజులు పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 16 దేశాలకు నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొని పలు డిజైన్లలో రూపొందించిన పతంగులను ఎగురవేస్తారని తెలిపారు.

వీటితో పాటు జాతీయ, అంతర్జాతయ స్వీట్లను స్టాళ్ళలో అందుబాటులో ఉంచుతారని, కైట్ ఫెస్టివల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు హస్త కళలు, చేనేత వస్త్రాల స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ప్రదర్శన తిలకించేందుకు వచ్చే సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిహెచ్‌ఎంసి, పోలీసు, ఇతర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వారు తెలిపారు. సందర్శకులకు ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతికశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ డైరక్టర్‌లు కె.మహేశ్,  ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News