Saturday, April 27, 2024

ఫార్మా దిగ్గజాలతో భేటీ

- Advertisement -
- Advertisement -

Minister KTR Meeting with pharma giants

ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ కంపెనీ
ప్రతినిధులతో భేటీ హైదరాబాద్ ఎంతో ప్రత్యేకమని తెలిపిన
కంపెనీల ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వం లైఫ్‌సైన్సెస్
పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయం: ప్రతినిధుల
కితాబు 20వ బయోఏషియా కన్వెన్షన్‌కు మూడు దిగ్గజ
కంపెనీలకు మంత్రి కెటిఆర్ ఆహ్వానం

మన : హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ రంగాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిపే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చొరవతో ఫార్మా దిగ్గజ కంపెనీ లు తమ పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నా యి. మంత్రి కె. తారకరామారావుతో సమావేశం తరువాత పలు కంపెనీలు హైదరాబాద్ లో కొత్తగా పెట్టుబడులు పెడతామని ప్రకటించడంతో పాటు మరికొన్ని కంపెనీలు భారీగా విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంతగా లైఫ్‌సైన్సెస్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఫార్మా గుర్తిస్తున్నాయి.

తెలంగాణలోని పారిశ్రామిక అనుకూలతలు, పారదర్శకత పాలనతో ఫార్చ్యూన్ కంపెనీలు అమెరికా అవతల తమ కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని లైఫ్ సైన్సెస్ రంగానికి మరింత బూస్ట్ ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా మూడు ఫార్మా దిగ్గజ కంపెనీలతో న్యూయార్క్‌లో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ప్రఖ్యాత కంపెనీలైన ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్జ జి.ఎస్‌కె సీనియర్ ప్రతినిధులను కెటిఆర్ కలుసుకున్నారు. ప్రపంచంలోనే టాప్ ఫార్మాసూటికల్ కార్పొరేషన్ కంపెనీలైన ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జిఎస్‌కె)లాంటి ఫార్చూన్ 500 కంపెనీలతో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి ముందుగా ఫైజర్ సిఈఓ, చైర్మెన్ డాక్టర్ ఆల్బర్ట్ బౌర్లా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ గ్లోబల్ సప్లై ఆఫీసర్ మైక్ మెక్‌డెర్మాట్ , సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ ఉవే స్కోన్‌బెక్ తో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణలో ఉన్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి వారికి వివరించారు. తమ ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, ఇస్తున్న ప్రాధాన్యతను గురించి కెటిఆర్ వారికి తెలియచేశారు. ఆ తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటైన జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఆర్ అండ్ డీ ఫార్మాసూటికల్స్, డాక్టర్ మథాయ్ మమ్మన్‌ను మంత్రి కెటిఆర్ కలిశారు. ఫార్మా పరిశోధనలకు హైదరాబాద్ లో ఉన్న అనుకూలతల గురించి కెటిఆర్ వారికి వివరించారు. హైదరాబాద్‌కు మాత్రమే సొంతమైన టెక్నాలజీ, డిజిటల్ ఆవిష్కరణ కేంద్రమైన మరో ఫార్మా కంపెనీ గ్లాక్సో స్మిత్‌క్లైన్ (GSK) సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆగమ్ ఉపాధ్యాయకు మంత్రి కెటిఆర్ ప్రజేంటేషన్ ఇచ్చారు.

కెటిఆర్ లాంటి విజనరీ మంత్రిగా ఉండడం

మంత్రి కెటిఆర్‌తో జరిగిన సమావేశంపై మూడు దిగ్గజ కంపెనీల సీనియర్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం కలిగిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. కెటిఆర్ లాంటి విజనరీ మంత్రిగా ఉండడం భారత పారిశ్రామిక రంగానికి ఎంతో ప్రయోజనం అని వారు కితాబునిచ్చారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్‌ను టాప్ గా నిలిపేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను వారు ప్రశంసించారు. తమ ప్రయత్నాలకు చేయూత ఇవ్వాలని కెటిఆర్ ఆ ముగ్గురిని సలహాలు, సూచనలు అడిగారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగబోయే 20వ బయోఏషియా కన్వెన్షన్‌కు రావాలని మూడు దిగ్గజ కంపెనీల ప్రతినిధులను మంత్రి కెటిఆర్ ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్‌తో పాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News