- Advertisement -
మహబూబ్ నగర్: నిరుపేద ఆడ బిడ్డ పెళ్లికి ఆసరాగా నిలుస్తున్న కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోటి 11వేల 600 రూపాయల 100 కల్యాణ లక్ష్మీ చెక్కులు, కోటి 82 లక్షల 21 వేల 112 రూపాయల 182 షాది ముబారక్ చెక్కులు కలిసి మొత్తం 2 కోట్ల 82 లక్షల 32 వేల 712 రూపాయల చెక్కులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అర్హులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యెస్.వెంకట్ రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ పవర్ నందలాల్, మున్సిపల్ చైర్మన్ కోరమోని నర్సిములు, రెవెన్యూ అధికారులు, కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.
Minister Srinivas goud distributed Kalyana lakshmi cheques
- Advertisement -