Monday, April 29, 2024

అందరికీ అవకాశాలు కల్పించాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మద్యం దుకాణాల దరఖాస్తులు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఏ మద్యం దుకాణానికైనా దరఖాస్తు చేసుకోవడానికి ఆయా జిల్లాలతో పాటు, హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కేంద్రం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ దరఖాస్తుల సమర్పణలో సిండికేట్‌గా ఏర్పడినా, ఎవరైనా దరఖాస్తులు సమర్పించుకుండా అడ్డుకున్నా వారిపై కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా జరగాలని, అందరికీ అవకాశాలు కల్పించాలని మంత్రి ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారికి, సహకరించే వారిపై నిఘా పెట్టి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో తక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపుతున్నామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడైతే తక్కువ దరఖాస్తులు వస్తు న్నాయో పరిశీలించాలని మంత్రి ఆదేశించారు.

సెల్ఫ్ అఫిడవిట్‌లను అంగీకరించాలి
గౌడ, ఎస్సీ, ఎస్టీ లకు కేటాయించిన మద్యం దుకాణాల దరఖాస్తులకు కుల ధ్రువీకరణ పత్రం, ఏజెన్సీ సర్టిఫికెట్ లేకపోతే సెల్ఫ్ అఫిడవిట్‌లను అంగీకరించాలని మంత్రి పేర్కొన్నారు. ఈ దరఖాస్తుల సమయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, దరఖాస్తుదారులకు సమాచారం కావాలన్నా వెంటనే స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారులను సంప్రదించాలని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2523ను సంప్రదించాలని మంత్రి సూచించారు.

జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ జిల్లాలో రియల్ ఎస్టేట్, సిమెంట్, ఫార్మా, వస్త్ర తదితర వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీని వివరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ, జాయింట్ కమిషనర్ కెఏబి శాస్త్రి, డిప్యూటీ కమిషనర్లు డేవిడ్ రవికాంత్, హరికిషన్, సహాయ కమిషనర్‌లు ఏ.చంద్రయ్య గౌడ్, శ్రీనివాస్, ఈఎస్‌లు ఏ. సత్యనారాయణ, టి. రవీందర్ రావు, అరుణ్ కుమార్, విజయ భాస్కర్ గౌడ్, విజయ్, పవన్ కుమార్, సంతోష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News