Monday, May 6, 2024

క్రీడాకారులను అభినందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Gowda congratulated the players

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీలోని మీరట్‌లో డిసెంబర్ 25, 26వ తేదీన జరిగిన 6వ ఐఎస్‌కెయూ జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ -2021 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెలంగాణకు చెందిన జైనా కలీల్, నాద, సాయి తేజ, శక్తి నిషాతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గౌతమ్‌లు బంగారు పతకాలు సాధించారు. ఏప్రిల్ 20 – 26, 2022 లో కెనడాలోని ఒంటారియోలో జరిగే అంతర్జాతీయ ఐఎస్‌కెయూ కరాటే ఛాంపియన్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో వారిని అభినందించారు. వీరితో పాటు డిసెంబర్ 20వ తేదీన ఢిల్లీలో జరిగిన రోలర్ స్కేటింగ్‌లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ లో గోల్ మెడల్స్‌ను సాధించిన మద్ది విక్రమ్ గౌడ్, మద్ది జీవన్ గౌడ్‌లను కూడా మంత్రి ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News