Sunday, May 5, 2024

వర్షాల కోసం తలపై కలశంతో ఎమ్మెల్యే జోగు రామన్న

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ ప్రతినిధి : వర్షాలు సకాలంలో కురవాలని పాడి పంటలు సమృద్దిగా పండి రైతులకు మంచి దిగుబడులు వచ్చేలా చూడాలని కోరుకుంటూ ఆదిలాబాద్ పట్టణంలో తాటిగూడలోని ఆలయంలో ఏర్పాటు చేసిన గంగ నీళ్ల జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి నీళ్లతో నిండిన కలశాన్ని ఎత్తుకొని ఆలయ ప్రదక్షణలు చేసి శివలింగానికి నీళ్లను సమర్పించారు. ఆనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షాలు సమృద్దిగా పడాలని కోరారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగిస్తూ మనం ఉన్న లేకున్నప్పటికినీ హిందూ ధర్మం రానున్న తరాలకు సైతం గుర్తుండి పోయేలా కార్యక్రమాలను నిర్వహిస్తూ హిందు ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు.

వర్షాలు సమృద్దిగా కురువాలంటే నాటి నుండి నేటి వరు పల్లెల్లో పట్టణాలలో కప్పతల్లి ఆటలు, మల్లన్న పూజలు , నీళ్ల జాతర, వంటి ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ భక్తిని చాటుతూ వస్తున్నామన్నారు. గంగపుత్ర సంఘ భవన నిర్మాణానికి రూ. 5 లక్షలతో స్థలాన్ని కేటాయించమన్నారు. భవన నిర్మాణానికి సైతం మరో 5 లక్షలతో నిర్మాణం చేపడుతామనారు. రానున్న రోజుల్లో పని చేసే పార్టీలను మాత్రమే గుర్తించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కౌన్సిలర్ ఆశోక్ స్వామి, కో ఆప్షన్ సంజయ్, సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News