Monday, May 6, 2024

దేశ్ మే తెలంగాణ రోషన్ హై

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరో: నవ వసంతాలు పూర్తిచే సుకుని పదో దశాబ్దంలో అడుగులు పడుతున్న తెలంగా ణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచామని ఎస్‌సి మహదేవ్ రత్నాకర్ అ న్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పు రస్కరించుకొని జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో నిర్వహించి న సాహితి దినోత్సవంవేడుకల సందర్భంగా జిహెచ్ ఏం సి ఖైరతాబాద్ జోనల్ ఎస్‌సి సహదేవ్ రత్నాకర్ సిపిఅర్ ఓ మొహమ్మద్ ముర్తుజా, పిఅర్‌ఓ జీవన్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ ఎఫ్ ఏం సలీంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్‌సి రత్నకర్ మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందున 9 ఏళ్లలో అభివృద్ది సం క్షే మం అమలులో దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నా రు.

ఈ సాహితీ దినోత్సవం సందర్భంగా తెలుగు ఉర్దూ హిందీ సాహితీవేత్తలతో కలిసి కవిసమ్మేళనంలో గం గా, జమున తేహజీబ్ ప్రతిబింబించేలా జరిగింది అన్నారు. ఆయా భాషలో ప్రావీణ్యం గల సాహితీ వేత్తలు ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేష్ మే తె లంగాణ రోషన్ హై, హమారా సబ్ సే ప్యారా తెలంగా ణ, చాహతహం కుష్బూ సే మహక హై తెలంగాణ. అభివృద్ది సంక్షేమలో ఈతొమ్మిది ఏళ్లలో విరాజిల్లుతున్న తె లంగాణ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకకు ఎనలేని గౌరవం దక్కుతుందంటూ ప లువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో అబ్దుల్ రషీద్ హ ర్షద్, సయ్యద్ నవీద్,జాఫ్రీ, అత్యబ్ ఇజాజ్, జాయిం జుమ్రహ్ , షకీల్ హైదర్ నహీం ఘోరీ, జహూర్ జహిర బాది ఏం లక్ష్మణ చార్యులు, మహదేవ్ రత్నాకర్, ఎఫ్ ఏం సలీం, ఉమాదేవి సవిత సోని, గోవింద్ అక్షయ్, క వులు కవి సమ్మేళనంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News