Tuesday, May 14, 2024

ముంపు బాధితులకు అండగా ఎమ్మెల్యే నన్నపునేని

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: వరంగల్‌లో భారీ వర్షాలు కురిసిన కారణంగా ముంపునకు గురైన బాధితకులకు తూర్పు నియో జకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అండగా నిలిచారు. వర్షాల వల్ల వరదల్లో తిరుగుతూ సహాయక చర్యల్లో పాల్గొని బాసటగా నిలిచారు. మంగళవారం నియోజకవర్గంలో తీవ్రంగా ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను ఆదు కోవాలనే సంకల్పంతో వ్యక్తిగతంగా వారానికి సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

అందులో భాగంగా 33వ డివిజన్ పెరుకవాడ శివాలయం సమీపంలో ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎవ్వ రూ అధైర్య పడొద్దని అండగా ఉంటామని, వ్యాధుల పట్ల కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ సుధాకర్, కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్, డివిజన్ అధ్యక్షుడు మిరిపెల్లి వినయ్, బీఆర్‌ఎస్ నాయకులు వడ్డెర కోటి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News