Sunday, April 28, 2024

బిఆర్‌ఎస్‌పై ఈసి కి ఫిర్యాదు : రఘునందన్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మనీ లాండరింగ్ కేసులో కస్టడీలో ఉన్న సుఖేశ్ చంద్రశేఖరన్ తన లాయర్ ద్వారా చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజీవాల్ ఆదేశాల మేరకు బిఆర్‌ఎస్ కార్యాలయంలోనే

6060 నంబర్ కలిగిన వాహనంలో పిళ్లై అనే వ్యక్తికి డబ్బులు అందజేసినట్లు రఘునందన్ పేర్కొన్నారు. పార్టీ ద్వారానే నేరుగా మనీలాండరింగ్ జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే ఆరోపించారు. మనీలాండరింగ్‌కి పాల్పడ్డారు కాబట్టి ఈ అంశంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మనీలాండరింగ్ కు పాల్పడిన బిఆర్‌ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News