Wednesday, May 8, 2024

ఆటా మహాసభల్లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించనున్న ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha responds on Illegal Mining

జూలై 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న ఆటా 17వ మహాసభలు
మహాసభల్లో పాల్గొననున్న కల్వకుంట్ల కవిత
తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించనున్న ఎంఎల్‌సి
మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 17వ మహాసభల్లో టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జూలై 1నుంచి 3వ తేదీ వరకు జరగనున్న ఆటా మహాసభలు- యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందింగా ఆటా ప్రతినిధులు ఆమెను ఆహ్వానించారు. 2వ తేదీన ఆటా మహాసభల్లో పాల్గొననున్న కవిత అదే రోజున మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 8 గంటలకు, దాదాపు 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఆటా ప్రైమ్ మీట్‌లో కవిత అతిధిగా హాజరుకానున్నారు. అనంతరం ఇదే సమావేశంలో బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరించనున్నారు. ప్రతిష్టాత్మకంగా ఆటా నిర్వహించే ఈ వేడుకలు ఈ సంవత్సరం మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. వందలాదిగా వలంటీర్లు వివిధ ఏర్పాట్ల కోసం 80 కమిటీలుగా ఏర్పడి ఇందుకోసం శ్రమిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు.

MLC Kavitha will participate in ATA Mahasabhalu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News