Wednesday, May 1, 2024

ప్రేమ….. కూతురిని చంపి… తగలబెట్టిన తల్లి

- Advertisement -
- Advertisement -

Honour Killing

 

ఛండీగఢ్: కూతురి ప్రేమ వ్యవహారంతో తన పరువు పోతుందని సొంత కుమర్తెను తల్లి చంపిన సంఘటన పంజాబ్‌లోని హోషియాపూర్‌లో జరిగింది. పరువు హత్యలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బల్వీందర్ కౌర్ కూతురు అమన్ ప్రీత్ సింగ్ అనే యువకుడిని ప్రేమించింది. బల్జాన్ గ్రామంలో ఉన్న ప్రియుడు అమన్ ప్రీత్ సింగ్ వద్దకు కౌర్ కూమార్తె వెళ్లింది. తన కూతురు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లి బల్వీందర్ కౌర్ ఫిర్యాదు చేసింది. బల్జాన్ గ్రామంలో యువకుడితో కూతురు ఉన్నట్టు గుర్తించి స్థానికంగా ఉన్న ఇద్దరు పోలీసులు, ముగ్గురు పెద్ద మనుషుల సహాయంతో కూతురిని ఇంటికి తీసుకొచ్చింది. కూతురు తన ప్రియుడి వద్దనే ఉంటానని తెగేసి చెప్పడంతో బలవంతంగా కూతురితో తల్లి నిద్రమాత్రలు మింగించింది. తన సోదరులు శివరాజ్, లాలాను పిలిచి కూతురు విషయం చెప్పింది. కూతురు గాఢ నిద్రలోని జారుకున్న తరువాత గొంతు నులిమి హత్య చేశారు. సత్యదేవ్, గుర్దీప్‌లతో కలిసి బల్వీందర్ తన కూతురు మృతదేహాన్ని అనవాళ్లు దొరకకుండా కాల్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News