Saturday, April 27, 2024

కన్న కొడుకును అమ్మిన తల్లి

- Advertisement -
- Advertisement -
mother sold her son in medak district
ఐసిడిఎస్ అధికారులు, పోలీసుల విచారణ

నర్సాపూర్ : కన్న తల్లి (ఎర్ర పోచమ్మ) తన 7 సంవత్సరాల కొడుకుని 15 వేలకు అమ్ముకున్న ఉదంతం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామంలో వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న, పోలీసులు,ఐసిడిఎస్ అధికారులు శనివారం గ్రామానికి చేరుకుని తల్లి ఎర్ర పోచమ్మను విచారించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మండల పరిధిలోని చిన్న చింతకుంట గ్రామానికి చెందిన, ఎర్ర పోచమ్మకు ఇద్దరు కుమారులు కాగా, భర్తతో గొడవ పడి చిన్న కుమారుడు హహేష్ (7)తో కలసి ఆరు నెలల క్రితం గ్రామం నుండి, భర్తకు దూరంగా వెళ్లి వేరే వ్యక్తితో సహజీవనం ఉంటున్నట్లు తెలిసిందన్నారు. ఇంటి నుండి కొడుకుతో వెళ్లిన కర్కశ తల్లి పోచమ్మ,తిరిగి ఆరు నెలల తరువాత ఒక్కతే ఇంటికి రావడంతో, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ని కుమారుడు ఎక్కడ అంటు నిలదీయడంతో, కసాయి తల్లి తన కొడుకుని 15 వేలకు అమ్మినట్లు అసలు విషయం బయట పెట్టింది. ఈవిషయం తెలుసుకున్న ఐసిడిఎస్ అధికారులు, పోలీసులు గ్రామనికి చేరుకుని పోచమ్మను ప్రశ్నించడంతో అమ్ముకున్నది నిజమేనట్టు ఒప్పుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News