Tuesday, April 30, 2024

అదానీని వెనక్కినెట్టిన ముకేశ్

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా అంబానీకి మొదటి స్థానం
ఆయన సంపద విలు రూ.8.08 లక్షల కోట్లు
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 వెల్లడి

న్యూఢిల్లీ : భారతదేశంలో అత్యంత సంపన్నుడి స్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముకేశ్ అంబానీ సొంతం చేసుకున్నారు. గతంలో ఈ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని ముకేశ్ తాజాగా వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్నారు. ‘360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023’ పేరిట హురున్ ఇండియా ప్రస్తుత సంపన్న వ్యాపారవేత్తల జాబితాను విడుదల చేసింది.

ఇది భారతదేశంలోని అత్యంత సంపన్నుల 12వ వార్షిక ర్యాంకింగ్, ఈ జాబితాలో గౌతమ్ అదానీ సంపద ముకేశ్ అంబానీ కంటే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే జనవరిలో వచ్చిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ నికర విలువ గణనీయంగా పడిపోయింది. గత దశాబ్దంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 150 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిందని, ఇది భారతదేశంలోని ఇతర కార్పొరేషన్ల కంటే ఎక్కువ అని నివేదిక పేర్కొంది. ముకేశ్ అంబానీ సంపద 2014లో రూ. 1,65,100 కోట్ల నుండి 2023 నాటికి రూ. 8,08,700 కోట్లకు పెరిగింది, అంటే ఆయన సంపద నాలుగు రెట్లు పెరిగింది. నివేదిక ప్రకారం, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రూ.4,74,800 కోట్ల ఆస్తులతో రెండో స్థానానికి పడిపోయారు.

సిరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావాలా దేశంలో మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించగా, ఆయన సంపద రూ. 2,78,500 కోట్లుగా ఉంది. హెచ్‌సిఎల్‌కి చెందిన శివ నాడార్ ఆస్తుల విలువ రూ. 2,28,900 కోట్లు, ఈ జాబితాలో ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. దీని తర్వాత లండన్‌కు చెందిన గోపీచంద్ హిందూజా రూ.1,76,500 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, అధినేత దిలీప్ సంఘ్వీ రూ.1,64,300 కోట్లతో ఆరో స్థానంలో ఉన్నారు.

టాప్ 10లో ఇంకా ఎవరెవరు..
రూ.1,62,300 కోట్ల ఆస్తులతో ఎల్‌ఎన్ మిట్టల్ అండ్ ఫ్యామి ఏడో స్థానంలో ఉండగా, రూ. 1,43,900 కోట్ల ఆస్తులతో రాధాకిషన్ దమానీ ఎనిమిదో స్థానం, రూ. 1,25,600 కోట్ల ఆస్తులతో కుమార్ మంగళం బిర్లా, కుటుంబం 9వ స్థానం, ఇంకా రూ. 1,20,700 కోట్ల ఆస్తులతో నీరజ్ బజాజ్ 10వ స్థానంలో ఉన్నారు.

ఐదేళ్లలో భారీ పెరుగుదల
ఇప్పుడు 1,319 మంది వ్యక్తులు రూ. 1,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను కలిగి ఉన్నారని 360 వన్ సహ వ్యవస్థాపకుడు యతిన్ షా తెలిపారు. గత ఐదేళ్లలో వీరి సంపదలో 76 శాతం పెరుగుదల కనిపించిందని అన్నారు. 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ జాబితాలోని సంపన్నుల మొత్తం సంపద రూ.109 లక్షల కోట్లకు చేరింది, అంటే సింగపూర్, యుఎఇ, సౌదీ అరేబియా దేశాల ఉమ్మడి జిడిపిని ఇది అధిగమించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News